తల్లి లేఖతో స్పందించిన కేంద్రం.. EY ఇండియా ఉద్యోగి మృతిపై విచారణకు ఆదేశం

తల్లి లేఖతో స్పందించిన కేంద్రం.. EY ఇండియా ఉద్యోగి మృతిపై విచారణకు ఆదేశం
X
పూణె మహిళ తల్లి ఎర్నెస్ట్ & యంగ్ ఇండియా అధినేతకు రాసిన లేఖ వైరల్ కావడంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.

అధిక పని ఒత్తిడి కారణంగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాకు చెందిన 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. పూణె మహిళ తల్లి ఎర్నెస్ట్ & యంగ్ ఇండియా అధినేతకు రాసిన లేఖ వైరల్ కావడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పని వాతావరణంలో అసురక్షిత, దోపిడీకి గురవుతున్నారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు.

"అన్నా సెబాస్టియన్ పెరాయిల్ యొక్క విషాదకరమైన మరణం విచారణకు కారణమైంది. న్యాయం చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాము, కార్మిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఫిర్యాదును తీసుకుంది" అని శోభా కరంద్లాజే ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపారు.

మహిళ మరణం చాలా బాధాకరమని బిజెపి నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ చేసిన పోస్ట్‌పై మంత్రి స్పందించారు. మాజీ కేంద్ర మంత్రి కూడా ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో పని వాతావరణం గురించి ఆమె కుటుంబం ఆరోపణలపై విచారణ కోరింది.

మార్చిలో E&Yలో చేరిన అన్నా సెబాస్టియన్ పెరయిల్ పూణే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 20న మరణించారు. ఆఫీసులో పని ఎక్కువడా ఉండడంతో తాను చాలా అలసి పోతున్నానని, నీరసంగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.

ఈ వారం ప్రారంభంలో ఆమె తల్లి అనితా అగస్టిన్ EY ఇండియా హెడ్‌కి రాసిన లేఖ వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. లేఖలో, పూణే మహిళ తన కుమార్తె విపరీతమైన పని ఒత్తిడి ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపిందని అది చివరికి ఆమె మరణానికి దారితీసిందని ధ్వజమెత్తారు.

Tags

Next Story