Coimbatore : నకిలీ పత్రాలు కేసుల్లో సంచలన తీర్పు

నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేసిన కేసులో తమిళనాడులోని కోయంబత్తూర్ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఓ వ్యక్తికి 383 ఏళ్ల జైలుశిక్షతో పాటు నిందితుడు రూ.3.32 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. తమిళనాడు ఆర్టీసీ కోయంబత్తూర్ డివిజన్లోని బస్సుల వేలంలో జరిగిన అక్రమాల కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం ఈ తీర్పు విలువరించింది.
చేసిన నేరం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాస్త ఆలస్యం అయినా తగిన శిక్ష వారికి విధిస్తుంది న్యాయస్థానం. అయితే వీటిలో మరణశిక్ష యాదవ జీవకర్ర శిక్షలు అన్నింటికంటే కఠినమైన మనకు తెలుసు. అలాంటి ఓ శిక్ష విధించింది కోయంబత్తూర్ కోర్టు. మోసం, పోర్జరీ కేసులో పట్టుబడిన ఒక వ్యక్తికి సుమారు 400 సంవత్సరాల జైలు శిక్ష మూడున్నర కోట్ల జరిమానా విధించింది.
బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయంటూ 1988 నవంబరు 9న తమిళనాడు ఆర్టీసీ తరపున ఒక ఫిర్యాదు నమోదైంది. సంస్థకు చెందిన 47 బస్సులను నకిలీ పత్రాలతో విక్రయించి, రూ.28 లక్షలు మోసం చేశారంటూ 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో చేరన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అసిస్టెంట్ కోదండపాణి, డిప్యూటీ మేనేజర్ రామచంద్రన్, మురుగనాథన్, దురైసామి, నాగరాజన్, నటరాజన్, రంగనాథన్, రాజేంద్రన్లను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.
1988 నుంచి ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈలోపే నటరాజన్, రామచంద్రన్, రంగనాథన్, రాజేంద్రన్ మృతిచెందారు. ఈ కేసులో కోర్టు తన తీర్పు శుక్రవారం వెలువడింది. కోదండపాణి మినహా మిగిలిన ముగ్గురినీ జడ్జి శివకుమార్ నిర్దోషులుగా పేర్కొన్నారు. సంస్థను మోసం చేసినందుకు కోదండపాణికి 47 నేరాల కింద ఒక్కో నేరానికి నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, అలాగే 47 ఫోర్జరీ నేరాలకు నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, ప్రభుత్వ ఆస్తులను కాజేసినందుకు మరో ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. ఈ మూడు శిక్షల మొత్తం కలిపితే 383 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం నిందితుడి వయసు 82 సంవత్సరాలు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏడేళ్ల జైలు శిక్షను ఏకకాలంలో అనుభవించాలని వెంటనే అతనిని జైలుకు తరలించాల్సిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. తమిళనాడులో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల్లో ఇది ఒక సంచలనం తీర్పుగా నిలిచిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com