Supreme Court: కోస్ట్ గార్డ్‌లో శాశ్వత కమిషన్‌ విషయంలో కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

Supreme Court:  కోస్ట్ గార్డ్‌లో శాశ్వత కమిషన్‌ విషయంలో  కేంద్రంపై సుప్రీం ఆగ్రహం
శాశ్వత కమిషన్‌ ‘మీరు మంజూరు చేయకుంటే మేము చేస్తాం" మంటూ ఫైర్

భారత తీరగస్తీ దళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ అలసత్వంపై సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా చర్యలు తీసుకోకుంటే తామే ఒక అడుగు ముందుకువేయాల్సి వస్తుందని హెచ్చరించింది. అర్హులైన షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారిణులతో శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఇండియన్ కోస్ట్ గార్డుకు చెందిన ఓ అధికారిణి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆమె పిటిషన్ పై విచారించింది.

ఆర్మీ, నేవీతో పోలిస్తే కోస్ట్ గార్డులో పనితీరు కొంచెం భిన్నంగా ఉంటుందని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ . వెంకటరమణి వాదించారు. మహిళలను మినహాయించేందుకు అవి కారణాలు కాదని పేర్కొంటూ ఏజీ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. మహిళలను వేరుగా చూడలేమని.. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తామే జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ స్పందనను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని పేర్కొంటూ తదుపరి విచారణ మార్చి 1కి వాయిదా వేసింది.

మహిళా అధికారి పిటిషన్‌పై ఈనెల 19న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోస్టు గార్డ్‌ విషయంలో ఎందుకు తేడా చూపిస్తున్నారని ప్రశ్నించింది. ‘కోస్టు గార్డ్‌ విభాగంలో మహిళలు ఎందుకు ఉండకూడదని మీరు అనుకొంటున్నారు? సరిహద్దులను కాపాడగలిగే మహిళలు.. సముద్ర తీర ప్రాంతాలను కూడా రక్షించగలరు! మీరు పదేపదే చెప్పే నారీశక్తిని.. చేతల్లో చూపించండి’ అంటూ కేంద్రాన్ని దుయ్యబట్టింది. పితృస్వామ్య మనస్తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించింది. మహిళలను మినహాయించేందుకు అవి కారణాలు కాదని పేర్కొంటూ ఏజీ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. మహిళలను వేరుగా చూడలేమని.. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తామే జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story