Toll Charges Increase 2024 : ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు పెంపు

Toll Charges Increase 2024 :  ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు పెంపు
X
వాహనదారులకు అలర్ట్

ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించి అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) టోల్‌ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థ ఆదివారం ప్రకటించింది. హెచ్​ఎండీఏ పరిధిలోని హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లిమిటెడ్​(హెచ్​జీసీఎల్​) నిర్వహణలో ఉండే ఓఆర్​ఆర్​ను ఐఆర్​బీ సంస్థ గత సంవత్సరం 30 ఏళ్లకు లీజు తీసుకుంది. నిబంధనల ప్రకారం ఏటా 5 శాతం వరకు టోల్​ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు సంస్థకు కల్పించింది. ఇందులో భాగంగా టోల్​ ధరలను పెంచింది.

ప్రస్తుతం పెరిగిన టోల్​ఛార్జ్​లు ఇవాళ్టి (జూన్ 3వ తేదీ) నుంచి అమల్లోకి వచ్చాయి. వివిధ రకాల వాహనాలను ఆరు కేటగిరీలుగా నిర్వాహకులు విభజించి ఛార్జీలను నిర్ణయించారు. వాహనదారులకు ధరలపై ఆందోళన లేకుండా టోల్​ప్లాజాల వద్ద బోర్డులను ఏర్పాటు చేసినట్టు నిర్వహణ సంస్థ తెలిపింది. కొత్త టోల్‌ రేట్లు, నెలవారీ, రోజువారీ పాసుల కోసం హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌ https://www.hmda.gov.in/ ను సంప్రదించాలని సూచించింది.

ప్రతి సంవత్సరం టోల్​ఛార్జీలు ఏప్రిల్​ 1వ తేదీన పెంచుతుంటారు. ఈ ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టోల్​ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దేశంలో జూన్​ 1న చివరి దశ పోలింగ్​ ముగియడంతో టోల్​ ధరలు పెంచుకునేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు వర్తిస్తాయని నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ టోల్​ ఛార్జీలు దేశవ్యాప్తంగా కూడా పెరిగాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.


Tags

Next Story