Mahua Moitra: సుప్రీంను ఆశ్రయించిన మహువా మొయిత్రా

Mahua Moitra:   సుప్రీంను ఆశ్రయించిన మహువా మొయిత్రా
బహిష్కరణ వేటుపై సవాల్‌

పార్లమెంట్‌ నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్ పార్టీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. క్యాష్ ఫర్ క్వెరీ కేసులో లోక్‌సభ ఎంపీగా బహిష్కరించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే . అదానీ గ్రూప్‌ గురించి పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు మహువా.. వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి డబ్బులు , విలువైన బహుమతులు తీసుకుందంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే ఆరోపించారు. దీనిపై ఆయన లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మొయిత్రాను లోక్‌సభ నుండి బహిష్కరించడాన్ని టీఎంసీ నేత తీవ్రంగా ఖండించారు. బహిష్కరణ తరువాత ఎథిక్స్ ప్యానెల్‌ను మొయిత్రా తప్పుబట్టారు. ఇది ప్రతిపక్షాన్ని బుల్‌డోజ్ చేయడానికి ఆయుధంగా మారిందని అన్నారు. ఎథిక్స్ కమిటీ, దాని నివేదిక నిబంధనలను ఉల్లంఘించిందని ఆమె ఆరోపించారు.

డిసెంబర్ 8న మొహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వం రద్దు అయింది. నైతిక విలువల కమిటీ నివేదికకు లోక్ సభ ఆమోదం తెలిపింది. డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని మొహువా మొయిత్రాపై ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ లోక్ సభలో నివేదికతో మెయిత్రాపై చర్యలు తీసుకుంది. మొహువాను లోక్ సభలో చర్చల్లో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు.

దీంతో ఆమె లోక్ సభ బయటికి వచ్చి మాట్లాడారు. ఎథిక్స్ కమిటీ నిబంధనలను ఉల్లంఘించిందని ఆమె పేర్కొన్నారు. ఎంపీ మొహువా మొయిత్రాను బహిష్కరిస్తూ లోక్ సభ తీర్మానించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షా సభ్యులు వాకౌట్ చేశారు. మహువా మొయిత్రా లోక్‌స‌భ సభ్యత్వం రద్దు చేయడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. లోక్‌స‌భ నుంచి వాకౌట్ చేసి పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపాయి.

మరోవైపు ఈ కేసులో హీరానందానీ అప్రూవర్‌గా మారారు. ప్రశ్నలు అడిగేందుకు తాను ఎంపీ మహువా మొయిత్రాకు డబ్బులు ఇచ్చానని వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ ఆరోపించారు. కృష్ణా నగర్‌ ఎంపీ అయిన మహువా మొయిత్రా పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీని లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీని దూషించి ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. తాను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగేందుకు మొయిత్రా పార్లమెంట్‌ లాగిన్‌ ఉపయోగించానని అక్టోబర్‌ 19న తెలిపారు. ఈ ఆరోపణలపై లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ నవంబర్‌ 9న విచారణ జరిపి హీరానందానీ ఆరోపణలు నిజమేనని తేల్చింది. మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని ప్రతిపాదన చేస్తూ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా లోక్‌సభ నుంచి మహువాను బహిష్కరిస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా శుక్రవారం ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story