బోరుబావిలో పడ్డ రెండున్నరేళ్ల చిన్నారి
By - Subba Reddy |7 Jun 2023 7:15 AM GMT
మధ్యప్రదేశ్ సీహోర్ జిల్లాలో రెండున్నరేళ్ల బాలిక బోరుబావిలో పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 300 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో
మధ్యప్రదేశ్ సీహోర్ జిల్లాలో రెండున్నరేళ్ల బాలిక బోరుబావిలో పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 300 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో చిన్నారి పడిపోవడంతో ఆమెను కాపాడేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారి ప్రస్తుతం 20 అడుగుల వద్ద ఇరుక్కుపోయి ఉన్నట్టు గుర్తించిన సిబ్బంది.. బాలికను సురక్షితంగా బయటకు తీసేందుకు జేసీబీలతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నా రు. ఉన్నతాధికారులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. చిన్నారి పరిస్థితిపై కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక బాలికను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేలా చూడాలని అధికారులను సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఆదేశించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com