Bihar: అందరూ చూస్తుండగానే కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్

బిహార్లోని నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిపోవడంపై దుమారం రేపుతోంది. భగల్పూర్ జిల్లాలోని ఖగారియాలో సుమారు 17వందల కోట్ల వ్యయంతో గంగా నదిపైన నిర్మిస్తున్న నాలుగు లెన్ల అగువాని-సుల్తాన్ గంజ్ బ్రిడ్జి అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా నదిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వంతెన కూలిపోతుండగా అక్కడున్న స్థానికులు ఫోన్లలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
అయితే... డిజైనులో లోపాలు ఉన్నందున నిపుణుల సూచన మేరకు కూల్చివేసినట్లు వెల్లడించారు అధికారులు. భాగల్పుర్, ఖగడియా జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ వంతెన పిల్లర్లు గత ఏప్రిల్ నెలలో తుపాను కారణంగా కొంతభాగం దెబ్బతిన్నాయి. బిహార్ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి 1,717 కోట్లు కేటాయించింది. 2015లో నీతీశ్కుమార్ శంకుస్థాపన చేసిన ఈ నిర్మాణం 2020 నాటికి పూర్తికావాల్సి ఉండగా, ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది.
ఈ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై జేడీయూ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. కమీషన్లు కోరే సంప్రదాయం జేడీయూ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఉందని ఆరోపించారు బీజేపీ నేతలు. రాజకీయ అస్థిరత వల్ల పరిపాలనలో అరాచకం, అవినీతి ఉందని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com