Uttarkand: అదుపు తప్పి లోయలో పడ్డ వాహనం

Uttarkand: అదుపు తప్పి లోయలో పడ్డ వాహనం
ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వాహనం రోడ్డు మీద నుంచి అదుపు తప్పి లోయలో పడిపోయింది.

ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వాహనం రోడ్డు మీద నుంచి అదుపు తప్పి లోయలో పడిపోయింది. అందులో మొత్తం 11 మంది ప్రయాణీకులు ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది ఐదుగురిని రక్షించింది. అయితే వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన జే.రవిరావు ఆచూకి లభ్యం కాలేదు. ఆయన భార్య కళ్యాణిని రక్షించారు. ఆమెను రిషికేశ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గల్లంతైనవారి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

వర్షాల కారణంగా పర్వతాల మీద నుంచి బండరాయి ఒక్కసారిగా దొర్లుకుంటూ వచ్చింది. ఆ బండరాయిని తప్పించే ప్రయత్నంలో మ్యాక్స్ వాహనం అదుపు తప్పి రోడ్డు మీద నుంచి లోయలో ప్రవహించే నదిలో పడిపోయింది. వాహన డ్రైవర్ సహా ఆరుగురు గల్లంతయ్యారు.సోన్‌ప్రయాగ్ నుంచి రిషికేశ్ తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఐదుగురిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది చికిత్స నిమిత్తం వారిని రిషికేశ్ ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story