VIRAPPAN: దయనీయంగా వీరప్పన్ బాధిత కుటుంబాలు

VIRAPPAN: దయనీయంగా వీరప్పన్ బాధిత కుటుంబాలు
X
వీరప్పన్ వేటలో అమరులైన అధికారులు.. ఇప్పటికీ న్యాయం చేయని ప్రభుత్వాలు

గం­ధ­పు చె­క్కల స్మ­గ్ల­ర్‌ వీ­ర­ప్ప­న్‌­‌­ను పట్టు­కో­వ­టం కోసం వె­ళ్లి అమ­రు­లైన వారి కు­టుం­బ­స­భ్యు­లు ప్ర­స్తు­తం దయ­నీయ స్థి­తి­లో ఉన్నా­రు. 1993 ఏప్రి­ల్ 9న తమి­ళ­నా­డు­లో­ని మే­ట్టూ­రు సమీ­పం పా­లా­రు అటవీ ప్రాం­తా­ని­కి వీ­ర­ప్ప­న్‌­ను పట్టు­కు­నేం­దు­కు టా­స్క్‌­ఫో­ర్స్‌ బృం­దం­తో పాటు ఎస్పీ గో­పా­ల­కృ­ష్ణ­న్‌ బయ­లు­దే­రా­రు. ఈయన వెంట వీ­ర­ప్ప­న్ గు­రిం­చి సమా­చా­రం ఇచ్చిన ఇన్‌­ఫా­ర్మ­ర్ల­ను, మే­ట్టూ­రు గ్రా­మా­ల­కు చెం­దిన 16మం­ది­ని, తన సహా­య­కు­డు మే­ట్టూ­రు క్లి­మె­న్స్‌ తది­త­రు­ల­ను వెం­ట­బె­ట్టు­కు­ని తీ­సు­కె­ళ్లా­రు. వీ­ర­ప్ప­న్‌­ను ని­ర్బం­ధిం­చేం­దు­కు అన్ని అను­కూ­లం­గా ఉన్నా­య­ను­కు­న్న సమ­యం­లో పా­లా­రు సమీ­పం సు­ర­క్కాయ మడు­వు ప్రాం­తం­లో వీ­ర­ప్ప­న్‌ పా­తి­పె­ట్టిన మం­దు­పా­తర పేలి.. వీరు ప్ర­యా­ణి­స్తు­న్న వ్యా­న్‌ తు­నా­తు­న­క­లైం­ది. ఈ ప్ర­మా­దం­లో పో­లీ­సు లు, అట­వీ­శా­ఖ­కు చెం­దిన ఏడు­గు­రు, గ్రా­మ­స్థు­లు 15 మంది దు­ర్మ­ర­ణం చెం­దా­రు. ఆ వ్యా­న్‌­లో ప్ర­యా­ణిం­చిన ఎస్పీ గో­పా­ల­కృ­ష్ణ­న్‌, క్లి­మె­న్స్‌, గో­విం­ద­ప్పా­డి గ్రా­మా­ని­కి చెం­దిన ఇన్‌­ఫా­ర్మ­ర్‌ ఇరు­సా­ర్‌ మా­త్ర­మే తీ­వ్ర గా­యా­ల­తో ప్రా­ణా­పా­యం నుం­చి బయ­ట­ప­డ్డా­రు.

బాంబు పెట్టిన వీరప్పన్

మందుపాతర నుంచి తృటిలో తప్పించుకుని తీవ్ర గాయాలైన ఇరుసార్‌ మాట్లాడారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు భయపడి ఎప్పుడు పిలిచినా వీరప్పన్‌ కోసం దట్టమైన అటవీ ప్రాంతాలకు వెళ్తుండేవారమన్నారు. 1993లో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది రాకను ముందే పసిగట్టిన వీరప్పన్‌ తాము ప్రయాణించే మార్గంలో మందుపాతరను అమర్చాడన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రూ.25 వేల నష్టపరిహారం సరిపోలేదన్నారు. ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మేకలను మేపుతున్నట్టు తెలిపారు.

సాయం వైద్యానికి కూడా సరిపోలేదు..

క్లి­మె­న్స్‌ మా­ట్లా­డు­తూ తమకు జరి­గిన నష్టా­ని­కి ప్ర­భు­త్వం ఇచ్చిన రూ.25వేలు వై­ద్యం తీ­సు­కో­వ­టా­ని­కి కూడా సరి­పో­లే­ద­న్నా­రు. ప్ర­స్తు­తం 75 ఏళ్ళ వయ­స్సు­లో కూలీ పను­ల­కు వె­ళ్ళి కడు­పు నిం­పు­కో­వా­ల్సిన దు­స్థి­తి­లో ఉన్నా­న­ని ఆవే­దన వ్య­క్తం చే­శా­రు. కనీ­సం తన కు­మా­ర్తె­కై­నా ప్ర­భు­త్వం ఉద్యో­గం కల్పి­స్తే తమ కు­టుం­బా­న్ని ఆదు­కు­న్న­వా­రు అవు­తా­ర­న్నా­రు. దా­దా­పు మూడు దశా­బ్దా­లు­గా వీ­ర­ప్ప­న్‌ మం­దు­పా­త­ర­కు బలైన 15 మంది కు­టుం­బీ­కు­లు, ఆ పే­లు­డు­లో బతి­కి బయ­ట­ప­డ్డ వా­రి­ద్ద­రి­ని రా­ష్ట్ర ప్ర­భు­త్వం ఆదు­కో­వా­ల­ని బా­ధిత కు­టుం­బ­స­భ్యు­లు కో­రు­తు­న్నా­రు.

బలవంతంగా తీసుకెళ్లారు..

కొంతమంది ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోగా.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు లక్ష రూపాయిలను ప్రభుత్వం అందించి చేతులు దులుపుకుంది. మరోవైపు మరణించిన వారి భార్యలు పిన్న వయస్సులోనే వితంతువులయ్యారు. కూలి పనులు చేసుకుంటూ చాలీచాలని సంపాదనతో జీవితాన్ని ఈడ్చుకొస్తున్నట్టు తెలిపారు. వీరప్పన్ సమాచారం ఇచ్చినందుకు ఆ రోజున బలవంతంగా తమ వారిని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. మందుపాతర పేలుడులో మృతి చెందిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి భారీగా నష్టపరిహారంచెల్లించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తమ గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. కటిక దారిద్య్రం అనుభవిస్తున్న తమను ప్రభుత్వమే కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వీరప్పన్‌ అమర్చిన మందుపాతరకు బలై దయనీయ స్థితిలో ఉన్న 15 మంది కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags

Next Story