వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వాగ్ బక్రీ టీ గ్రూప్ యజమాని

విధి ఎంత బలీయమైనది. వీధి కుక్కల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో క్రిందపడి మరణించారు వాగ్ బక్రీ యజమాని పరాగ్ దేశాయ్. వాగ్ బక్రీ టీ గ్రూప్ యజమాని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ (49) బ్రెయిన్ హెమరేజ్తో కొన్ని రోజులు వెంటిలేటర్పై ఉన్నారు. అనంతరం ఆదివారం సాయంత్రం మరణించారు. అహ్మదాబాద్లో వీధికుక్కల నుండి తప్పించుకునే ప్రయత్నంలో పడిపోవడం వల్ల మెదడు రక్తస్రావం జరిగి మరణించారు.
టాప్ వాఘ్ బక్రీ ఎగ్జిక్యూటివ్ అందించిన సమాచారం ప్రకారం, పరాగ్ దేశాయ్ అక్టోబరు 15న సాయంత్రం వాకింగ్ కు వెళుతుండగా వీధికుక్కలు వెంబడించాయి. వాటినుంచి తప్పించుకునే ప్రయత్నంలో జారిపడిపోయారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినా మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించి అక్కడ శస్త్ర చికిత్స చేశారు. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్పైనే ఉన్నారు.
సంస్థ instagram పోస్ట్లో, "ప్రగాఢమైన శోకంతో, మా ప్రియమైన పరాగ్ దేశాయ్ యొక్క విచారకరమైన మరణాన్ని తెలియజేయడానికి మేము చింతిస్తున్నాము" అని పంచుకున్నారు. పరాగ్ దేశాయ్ వాఘ్ బక్రీ టీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రసేష్ దేశాయ్ కుమారుడు. ఆయనకు భార్య విదిషా, కుమార్తె పరిషా ఉన్నారు.
దేశాయ్ 30 సంవత్సరాలకు పైగా వ్యవస్థాపక అనుభవంతో, గ్రూప్ యొక్క ఇంటర్నేషనల్ బిజినెస్, సేల్స్ మరియు మార్కెటింగ్కు నాయకత్వం వహించారు. అతను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) వంటి ప్రముఖ పరిశ్రమ ప్లాట్ఫారమ్లలో చురుకుగా పాల్గొనేవారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com