West Bengal : మనీలాండరింగ్ కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి అరెస్ట్..

West Bengal : మనీలాండరింగ్ కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి అరెస్ట్..
X
West Bengal : టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ స్కాం కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ పోలీసులు.

West Bengal : టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ స్కాం కేసులో.... మనీలాండరింగ్‌ జరిగినట్లు నిర్ధారణ కావడంతో..... బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్థ ఛటర్జీని అరెస్ట్‌ చేశారు ఈడీ అధికారులు. రెండ్రోజులుగా ఆయన్ను విచారించిన ఈడీ అధికారులు.. చివరికి... ఆయన్ను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించారు.

ఇప్పటికే ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ ఇంట్లో రూ.20 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు.. ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కూడా అర్పిత నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. పలు ఆస్తుల ఫైల్స్‌తో పాటు 50 లక్షల విలువైన బంగారు, వజ్ర ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు..

మంత్రి పార్థా చటర్జీతో పాటు ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ, విద్యా మంత్రి ప్రకాశ్‌ అధికారి, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రాథమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్‌ భట్టాచార్య, మరికొందరి నివాసాలపైనా శుక్రవారం.... ఏకకాలంలో దాడులు చేశారు ఈడీ అధికారులు.

పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్‌డీగా పని చేసిన బందోపాధ్యాయ్‌, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్జీ ఇళ్లలో సోదాలు జరిగాయి. అర్పితా ఇంట్లో రూ.20 కోట్ల నగదు దొరికింది. ఆ మొత్తం టీచర్‌ రిక్రూట్‌ స్కాంకు సంబంధించిందేనంటున్నారు ఈడీ అధికారులు.

ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్లు, నాన్‌ టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌లో స్కాం జరిగినట్లు కేసు నమోదైంది. గత నెల 29న రెండు FIR నమోదు చేసిన ఈడీ అధికారులు.. దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌ స్కూల్ సర్వీస్ కమిషన్... రిక్రూట్‌మెంట్ల ప్రక్రియ నిర్వహించింది. ఈ నియామాకాల్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి.

మంత్రి పార్థ ఛటర్జీ.... ఓ హై పవర్డ్ సూపర్‌వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ స్కాంకు మూలం ఈ కమిటీయేనని కలకత్తా హైకోర్టు గతంలో పేర్కొంది. కోర్టు సమక్షంలో కమిటీ సభ్యులు ఇచ్చిన స్టేట్‌మెంట్లు పరస్పర విరుద్ధంగా ఉండటంతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. పార్థ ఛటర్జీ మే 18న, మే 25న సీబీఐ దర్యాప్తునకు హాజరయ్యారు.

ఈడీ దాడులతో.... బెంగాల్‌ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడింది బీజేపీ. రెండు ఫోటోలను షేర్‌ చేసింది. అందులో సీఎం మమతా బెనర్జీ, మంత్రి ఛటర్జీతో అర్పిత ఉన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందందంటూ బీజేపీ నేత సువేందు అధికారి ట్వీట్‌ చేశారు....

Tags

Next Story