Uttar Pradesh: వికలాంగ మహిళను ఈడ్చి పారేసిన పోలీసులు..!

జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు రోడ్డుపై ఈడ్చుకుంటూ సమీప పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఉత్తరప్రదేశ్ హర్దోయి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో ఎస్పీ కేశవ్చంద్ గోస్వామి మహిళా కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వికలాంగ మహిళను ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు రోడ్డుపై ఈడ్చుకొంటూ తీసుకువెళ్లారు. ఎస్పీ కార్యాలయం నుంచి సమీప పోలీస్స్టేషన్ వరకు ఆమెను లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే హర్దోయీ జిల్లాలో పిహానీ ప్రాంతానికి చెందిన ఓ వికలాంగ మహిళ శనివారం ఎస్పీ కార్యాలయంకు వచ్చింది. ఆమెను ఎస్పీ కార్యాలయం లోపలికి అనుమతించకుండా.. ఇద్దరు మహిళా పోలీసులు అడ్డుకున్నారు. ఆపై ఆ వికలాంగ మహిళను రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. మహిళను నేల మీదు పోలీస్ స్టేషన్ వైపు లాక్కుంటూ తీసుకెళ్లారు. ఎస్పీ కార్యాలయం బయట జరిగిన ఈ ఘటన చూసి అటుగా వెళుతున్న అందరూ షాక్ అయ్యారు.
అయితే భర్తతో విభేదాలు రావడంతో ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చానని, తనను లోపలికి అనుమతించకుండా పోలీసులు ఈడ్చుకెళ్లారని బాధిత మహిళ చెబుతోంది. ఆమె ఎస్పీ కార్యాలయం గోడ ఎక్కేందుకు ప్రయత్నం చేసిందని, అందుకే ఆమెను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎస్పీ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com