కుమారుడి పెళ్లి డేట్ ప్రకటించిన షర్మిల
By - Prasanna |1 Jan 2024 7:09 AM GMT
షర్మిల తనయుడు రాజా రెడ్డి పెళ్లి ఫిక్స్ అయ్యిందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
షర్మిల తనయుడు రాజా రెడ్డి పెళ్లి ఫిక్స్ అయ్యిందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈరోజు కొత్త సంవత్సరం రోజున షర్మిల తన కుమారుడి వివాహాన్ని అధికారికంగా ధృవీకరించారు. ఈ విషయాన్ని షర్మిల సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “ప్రతి ఒక్కరికీ 2024 ఆశీర్వాదం కావాలి! జనవరి 18న నా కొడుకు వైఎస్ రాజా రెడ్డి నిశ్చితార్థం తన ప్రియురాలు అట్లూరి ప్రియతో, వారి పెళ్లి ఫిబ్రవరి 17, 2024న జరుగుతుందనే వార్తను పంచుకోవడం ఆనందంగా ఉంది. "రేపు, మేము ఇడుపులపాయ వద్ద ఉన్న YSR ఘాట్ని సందర్శిస్తాము, త్వరలో కాబోయే వధూవరులతో కలిసి, మొదటి ఆహ్వాన పత్రాన్ని అందించి, తండ్రి ఆశీర్వాదం తీసుకుంటాము" అని ఆమె పోస్ట్ లో పేర్కొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com