ప్రేమలో పడిన వైఎస్ షర్మిల తనయుడు.. త్వరలో మోగనున్న పెళ్లి బాజాలు
By - Prasanna |2 Dec 2023 9:36 AM GMT
వైఎస్ షర్మిల తనయుడు రాజా రెడ్డి త్వరలో ప్రియా అట్లూరిని పెళ్లి చేసుకోబోతున్నారు.
వైఎస్ షర్మిల తనయుడు రాజా రెడ్డి త్వరలో ప్రియా అట్లూరిని పెళ్లి చేసుకోబోతున్నారు. అమెరికాలో గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. పై చదువుల కోసం USA వెళ్ళిన రాజారెడ్డికి, అక్కడే చదువుకుంటున్న ప్రియ అట్లూరితో పరిచయం ప్రేమగా మారింది. ప్రియకు US పౌరసత్వం కూడా ఉంది. ప్రియా అట్లూరి అట్లూరి విజయ వెంకట ప్రసాద్ మనవరాలు.
ఈ యువ జంట కలయిక తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన సంఘటనలలో ఒకటిగా మారనుంది. అయితే వైఎస్ కుటుంబంలో కులాంతర, మతాంతర వివాహాల చరిత్ర ఉండడంతో ఇది కొత్త వార్త ఏమీ కాదు. వైఎస్ షర్మిలది కూడా కులాంతర వివాహం కావడం గమనార్హం.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com