Petrol Rates: లీటర్ పెట్రోల్పై రూ.25 తగ్గించిన సీఎం..
Petrol Rates: జార్ఖండ్ రాష్ట్రంలో పెట్రోల్ ధరలను రూ.25 తగ్గిస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ బుధవారం ప్రకటించారు. అయితే ఈ అవకాశం ద్విచక్ర వాహనాలు ఉన్నవారు మాత్రమే పొందగలరని చెప్పారు.
పెట్రోలు, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దీని కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ద్విచక్ర వాహనాలకు పెట్రోల్పై లీటరుకు ₹ 25 ఉపశమనం కల్పించింది. ఈ ప్రయోజనం 26 జనవరి 2022 నుండి ప్రారంభమవుతుంది అని Mr @HemantSorenJMM" అని జార్ఖండ్ CMO ట్వీట్ చేసింది.
పెట్రో ధరల తగ్గింపు పేదలకు లేదా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న పెట్రో ధరలు మధ్యతరగతి, పేదలపై ప్రభావం చూపుతున్నాయని, రాష్ట్రంలో పెట్రో ధరల కారణంగా పేద ప్రజలు తమ మోటార్సైకిల్ను నడపలేకపోతున్నారని సీఎం అన్నారు.
రూ. ద్విచక్ర వాహనంలో నింపిన ప్రతి లీటరుకు 25 రూపాయల నగదు ప్రజల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. 10 లీటర్ల పెట్రోల్ కోసం ఈ సదుపాయాన్ని పొందవచ్చు. జనవరి 26 నుంచి జార్ఖండ్లో ఈ నిబంధన వర్తిస్తుంది.
पेट्रोल-डीजल के मूल्य में लगातार इजाफा हो रहा है, इससे गरीब और मध्यम वर्ग के लोग सबसे अधिक प्रभावित हैं। इसलिए सरकार ने राज्य स्तर से दुपहिया वाहन के लिए पेट्रोल पर प्रति लीटर ₹25 की राहत देगी, इसका लाभ 26 जनवरी 2022 से मिलना शुरू होगा:- श्री @HemantSorenJMM pic.twitter.com/MsinoGS60Y
— Office of Chief Minister, Jharkhand (@JharkhandCMO) December 29, 2021
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com