ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

ఒడిశాలోని రైలు ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. పలువురు కేంద్ర మంత్రులతో కలిసి ప్రమాద జరిగిన రైల్వే ట్రాక్‌పైకి వెళ్లిన మోదీ... ప్రమాద తీవ్రతను పరిశీలించారు. ట్రాక్‌ పై చెల్లచెదురుగా పడి ఉన్న బోగీలను పరిశీలించిన మోదీ.. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు ప్రధాని మోదీ. అనంతరం పలు వివరాలను ప్రధానికి వివరించారు కేంద్ర మంత్రులు. ప్రమాద తీవ్రతో పాటు ప్రమాదానికి గల కారణాలను మోదీకి వివరించారు. ఇక ప్రాధమిక నివేదికను కూడా మోదీకి అందజేశారు.

మరోవైపు కాసేపట్లో కటక్‌ ఆస్పత్రికి వెళ్లనున్నారు ప్రధాని మోదీ. గాయపడిన వారిని పరామర్శించనున్నారు మోదీ. బాధితులకు అడగా ఉంటామని భరోసా ఇచ్చి.. వారికి దైర్యం చెప్పనున్నారు. ఇక బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశించారు. స్వల్ప గాయాలు అయిన వారికి వైద్యం అందించి వారి స్వస్థలాలకు పంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు ప్రమాదానికి సంబంధించి అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు మోదీ.

Tags

Read MoreRead Less
Next Story