
By - Vijayanand |15 April 2023 2:04 PM IST
కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్ర భద్రతా దళాల కానిస్టేబుల్ ఎంపిక పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఇకపై తెలుగుతో పాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలను నిర్వహించనుంది. ఇప్పటి వరకు కేవలం హిందీ, ఇంగ్లీష్లోనే పరీక్షల నిర్వహణ ఉండేది. 2024 జనవరి నుండి ఇంగ్లీష్, హిందీతో పాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణ ఉంటుంది. కేంద్ర భద్రతా బలగాల కానిస్టేబుల్ ఎంపిక పరీక్షలను తెలుగులో కూడా నిర్వహించాలని ఇటీవలే కేంద్రానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com