మొదలైన బీజేపీ నిరుద్యోగ మార్చ్‌

మొదలైన బీజేపీ నిరుద్యోగ మార్చ్‌

వరంగల్‌లో బీజేపీ నిరుద్యోగ మార్చ్‌ మొదలైంది. కేయూ జంక్షన్‌ నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు 2 కిలోమీటర్ల మేర ర్యాలీ జరగనుంది. ఈ ప్రదర్శనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసుపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు పేపర్‌ లీక్‌ కేసులో మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు బీజేపీ నేతలు.

Next Story