By - Subba Reddy |18 April 2023 6:45 AM GMT
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేశామని మంత్రి హరీష్రావు అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో వంద పడకల ఆస్పత్రికి మంత్రి జగదీష్రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని హరీష్రావు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని డయాలసిస్ సేవలు మరింత పెంచామన్నారు. రాష్ట్రంలో 7 వేల ఎంబీబీఎస్ సీట్లను పెంచుకున్నామని తెలిపారు. గతంలో 20 ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజీ వచ్చేదన్న హరీష్రావు.. ఇప్పుడు ఏడాదిలో 7 నుంచి 8 కాలేజీలు వస్తున్నాయని స్పష్టంచేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com