తగ్గినట్లే తగ్గి విజృంభిస్తోన్న కరోనా

తగ్గినట్లే తగ్గి విజృంభిస్తోన్న కరోనా

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఒక్క రోజులోనే 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవర పెడుతుంది. ఆదివారానికి 24 గంటల్లో 7వేల 633 మంది వైరస్ బారిన పడగా.. సోమవారం 9వేల 111 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే కరోనా ప్రభావం తగ్గుతోందని అధికారులు భావించారు. అయితే, ఇవాళ మరోసారి కేసులు 10 వేలు దాటడంపై అధికారవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అటు తెలంగాణలో వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపడుతున్నారు.

Next Story