రైతు కంట రక్త కన్నీరు

రైతు కంట రక్త కన్నీరు

తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్ష ప్రభావం అధికంగా ఉంది. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో నిన్ని రాత్రి కురిసిన వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. నిన్న ఒక్క రోజే సుమారు 50 వేల పై చిలుకు బస్తాలు రావడంతో ధాన్యం కాంటా వేయడం ఆలస్యం అయ్యింది. దీంతో రైతుల ధాన్యం కుప్పలు అలాగే ఉండటంతో కాంటా వేసిన బస్తాలు సహా ధాన్యం రాశుల కిందకు వర్షం నీరు చేరి తడిసిపోయాయి. అధికారుల తీరు వల్లే ఇలా జరిగిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story