
By - Chitralekha |22 April 2023 4:39 PM IST
సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. డెలివరీ కోసం వచ్చిన గర్భిణి, శిశువు మృతి చెందారు. సిర్గాపూర్ మండలం వాసర తండాకు చెందిన రేణుక.. డెలివరీ కోసం రెండు రోజుల క్రితం ఆస్పత్రికి వచ్చింది. నిన్న సాయంత్రం ఆరోగ్యం విషమించింది. వైద్యులు డెలివరీ చేయడంతో మృత శిశువు జన్మించింది. రేణుక పరిస్థితి విషమంగా మారింది. ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. కార్డియాక్ అరెస్ట్ వల్లే రేణుక మృతి చెందిందని వైద్యులు అంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com