By - Subba Reddy |23 April 2023 6:45 AM GMT
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేరుకు మాత్రమే డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయని మంత్రి హరీష్రావు ఆరోపించారు. సిద్ధిపేటలో పర్యటించిన ఆయన.. 50 మంది వికలాంగులకు హోండా స్కూటీలు పంపిణీ చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనివిధంగా వికలాంగులకు సీఎం కేసీఆర్ పెన్షన్ ఇస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణలో లక్ష రూపాయల విలువైన బైక్లను వికలాంగులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోందని మంత్రి హరీష్రావు తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com