By - Chitralekha |24 April 2023 10:00 AM GMT
కర్నూలు జిల్లాలో రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. బి.తాండ్రపాడులో పలువురు యువకులు జులాయిగా తిరుగుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఘటనలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఒకే రౌడీ గ్యాంగ్ మూడు చోట్ల దాడులకు తెగబడింది. నగర శివారులో రౌడీ మూక హల్చల్ చేశారు. జనంపైనా, చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వారిపైనా పట్టపగలే దాడులకు తెగబడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. రౌడీ గ్యాంగ్ దాడులతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com