By - Chitralekha |24 April 2023 11:01 AM GMT
పేదలందరికీ ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో ఆధునాతన హంగులతో నిర్మితమైన టిడ్కో గృహాలు పేదలకు అందకుండా పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మారడంతో అవి ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు అందడంలేదు. రాజమహేంద్రవరం రూరల్లోని ధవళేశ్వరం ఉప్పెర కాలనీ సమీపంలో కోట్లాది రూపాయల వ్యయంతో టిడ్కో ఇళ్లు నిర్మించారు. ప్రస్తుతం అక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ నిర్లక్ష్యంపై వామపక్షాల నేతలు మండిపడుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com