
By - Subba Reddy |25 April 2023 8:45 AM IST
నీళ్లు, నిధులు, నియామకాలు అన్న సీఎం కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. 9 ఏళ్లుగా నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్.. ఊరికో ఉద్యోగం అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. తాము ఒత్తిడి చేయడం వల్లే 80వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేశారని చెప్పారు. పరీక్షలు కూడా ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోతుందని విమర్శించారు. TSPSCలో ఇష్టం వచ్చినట్లు నియామకాలు చేశారని ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com