వైఎస్ షర్మిల బెయిల్ పిటిష్‌పై నాంపల్లి కోర్టులో విచారణ

వైఎస్ షర్మిల బెయిల్ పిటిష్‌పై నాంపల్లి కోర్టులో విచారణ

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెయిల్ పిటిష్‌పై ఇవాళ నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. జూబ్లీహిల్స్‌ పోలీసులపై దాడి కేసులో అరెస్టైన షర్మిలకు.. నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ పిటిషన్‌పై ఇవాళ వాదనలు జరగనున్నాయి. బెయిల్ ఇవ్వొద్దంటూ కౌంటర్‌ దాఖలు చేయనున్నారు పోలీసులు. పోలీసులపై దాడి కేసులో అరెస్ట్‌ అయిన షర్మిల ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. కూతురిని పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ చంచల్‌గూడ జైలుకు వెళ్లారు.

Next Story