
By - Subba Reddy |25 April 2023 1:00 PM IST
రాయల తెలంగాణ, ప్రత్యేక రాయలసీమ ఇప్పుడు సాధ్యం కాదని తేల్చిచెప్పేసారు మంత్రి జగదీష్రెడ్డి. జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ఏపీలో ప్రభుత్వాల వైఫల్యాలు, పాలకుల లోపంతోనే రాయల తెలంగాణ అంశంపై తెరమీదకొచ్చిందన్నారు. ఏపీ ప్రజలు పాలకులను మార్చి సువర్ణాంధ్రగా మార్చుకోవాలని తెలిపారు. వెనుకబాటుకు కారణమైన పాలకుల మీద ఏపీ ప్రజలు తిరుగుబాటు చేయాలన్నారు. అలాగే అభివృద్ధి సాధించే నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా.. ఏపీ ప్రజలు, మేధావులు, నాయకులు ఆలోచించాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్న మంత్రి జగదీష్రెడ్డి.. బీఆర్ఎస్తోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారమని స్పష్టంచేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com