
By - Subba Reddy |25 April 2023 1:15 PM IST
వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీవ్ర ఒత్తిడిలో ఓవైపు.. సుప్రీం కోర్టు షాక్ మరోవైపు.. ఈ నేపథ్యంలో వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు వెళ్తున్నారు. ఇడుపులపాయలో తమ కుటుంబ సభ్యులతో అవినాష్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇప్పటికే వైఎస్ కుటుంబంలోని కీలక వ్యక్తులు ఇడుపులపాయ ఎస్టేట్కు చేరుకున్నారు. సుప్రీం కోర్టు ఆర్డర్తో సీబీఐకి స్వేచ్ఛ వచ్చిందని.. ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ తథ్యమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. వైఎస్ కుటుంబ సభ్యులతో అవినాష్ రెడ్డి భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com