షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట

షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. రెండు ష్యూరిటీలు, 30వేల పూచీకత్తుతో బెయిల్‌ ఇచ్చింది. నిన్న విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై షర్మిల చేయిచేసుకోవడంతో పోలీసులు ఆమెపై కేసుసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Next Story