
By - Subba Reddy |26 April 2023 11:30 AM IST
విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఆర్కే బాచ్లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గాజువాకకు చెందిన స్వాతి అనే వివాహిత మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె ఆచూకి కోసం గాలిస్తుండగానే బీచ్లో అనుమానాస్పద స్థితిలో ఆమె మృతదేహం ఇసుకలో కూరుకుపోయి అర్థనగ్నంగా కనిపించింది. అయితే స్వాతి ఐదు నెలల గర్భవతి అని ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందే తన భర్తతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com