
By - Subba Reddy |26 April 2023 1:15 PM IST
తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామ రక్ష అన్నారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కూడా అయిన మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో.. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రతినిధుల సభ యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించారు. ఇందులో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కేటీఆర్ హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి సారించి.. విశ్వనగరంగా చేశారని మాగంటి గోపీనాథ్ అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడడం తగదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com