By - Chitralekha |26 April 2023 9:29 AM GMT
మంచిర్యాల హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతికి, మహేశ్ కు మధ్య గతంలోనే ప్రేమ వ్యవహరం నడిచిందని తెలిసింది. అది నచ్చక యువతికి వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. కోపంతో మహేష్.. యువతితో కలిసిన తిరిగిన ఫోటోలు, వీడియోలను ఆమె భర్తకు పంపాడు. కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో యువతి, ఆమె భర్తకు మధ్య విభేదాలు తలెత్తాయి. కొద్ది నెలల క్రితం ఆమె భర్త ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ నేపథ్యంలో మహేశ్ వేధింపులు ఎక్కువ అవ్వడంతో అతడిని హత్యచేసినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com