By - Chitralekha |27 April 2023 10:43 AM GMT
ఉద్యోగుల సమస్యల సాధన కోసం ఏపీ ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గేదే లేదంటున్నాయి. నిన్న సీఎస్ను కలిసిన ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు.. జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. జేఏసీలోని అన్ని సంఘాలతో విస్తృతంగా చర్చించి ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com