By - Chitralekha |28 April 2023 11:41 AM GMT
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నిరుద్యోగ సభకు సర్వం సిద్ధమైంది. భారీ జన సమీకరణ చేసేందుకు పార్టీ నేతలు సమాయత్తమయ్యారు. కార్యక్రమంలో పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డితోపాటు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ సీనియర్లు జానా రెడ్డి, దామోదర్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొననున్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత నల్గొండలో మొదటిసారి అడుగుపెడుతున్నారు. ఉప్పునిప్పుగా ఉండే నల్గొండ జిల్లా సీనియర్ నాయకులతో కలిసి ఒకే వేదికను పంచుకుంటున్నారు. దీంతో సొంత పార్టీ శ్రేణులే ఆసక్తిగా గమనిస్తున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com