చిన్నారిని మింగేసిన మ్యాన్ హోల్

చిన్నారిని మింగేసిన మ్యాన్ హోల్

సికింద్రాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైపోయింది. కళాసిగూడలో 9 ఏళ్ల చిన్నారిని మ్యాన్‌హోల్ మింగేసింది. మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండటంతో చిన్నారి డ్రైనేజీలో పడిపోయింది. ఆ తర్వాత నాలాలో కొట్టుకుపోయింది. పార్క్‌లైన్ వద్ద పాప మృతదేహాన్ని DRF సిబ్బంది గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురికీ తరలించారు.

Next Story