
By - Chitralekha |29 April 2023 12:59 PM IST
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతా మృతి చెందడంపై ఆ దేశ అటవీ, మత్య్స, పర్యావరణశాఖ స్పందించింది. ఈ తరహా పరిణామాలు ఉంటాయని ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఊహించామని వెల్లడించింది. మాంసాహార జంతువులను ఒక చోటు నుంచి మరో చోటుకి తరలించడం, వాటిని అక్కడ పెంచడం చాలా సంక్లిస్టమైన విషయమని అధికారులు అన్నారు. అంతేకాకుండా కొన్ని జంతువులుకొత్త వాతావరణానికిఅలవాటు పడలేవన్నారు. పరిసరాలు కూడా వాటిపై ప్రభావం చూపిస్తాయని... ఈ క్రమంలో కొన్ని ప్రాణాలు కోల్పోతాయని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com