
By - Chitralekha |29 April 2023 3:46 PM IST
హిందూపురం వైసీపీలో అసమ్మతి సెగ రేగింది. హిందూపురం కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. దీంతో ఒక్క నిమిషంలోనే కౌన్సిల్ సమావేశాన్ని ముగించారు. ఛైర్ పర్సన్ ఇంద్రజ అవినీతి పాలన కొనసాగిస్తున్నట్లు ప్లకార్డులు, నల్ల రిబ్బన్లతో వైసీపీకి చెందిన 13 మంది అసమ్మతి కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారు. కౌన్సిల్ హాల్లో కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అటు.. టీడీపీ కౌన్సిలర్లు ఛైర్ పర్సన్ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కౌన్సిల్ హాల్ దగ్గరకు వచ్చిన వైసీపీ కౌన్సిలర్ల భర్తలను పోలీసులు వెళ్లిపోవాలనడంతో.. వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com