
By - Chitralekha |29 April 2023 4:05 PM IST
జవాన్లతో వెళ్తున్న ఆర్మీ మెహికిల్ లోయలోపడి ఇద్దరు సైనికులు మరణించారు. ఈ ఘటన జమ్మూ కశ్మీర్ లోని రాజౌరిలో శనివారం జరిగింది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ( LoC ) సమీపంలోని కేరి సెక్టార్ వద్ద ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న దుంగిగాలా గ్రామ సమీపంలోని ఓ మలుపు వద్ద ఆర్మీకి చెందిన అంబులెన్స్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్, ఓ జవాను మృతి చెందినట్లు చెప్పారు. వారి మృతదేహాలను వెలికితీస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com