
By - Subba Reddy |29 April 2023 5:00 PM IST
ఐపీఎల్ నకిలీ టికెట్స్ తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. ఆరుగురిని అరెస్ట్ చేసి రెండు వందల నకిలీ టికెట్లు తయారు చేసినట్లు గుర్తించారు. అందులో 132 టికెట్లను విక్రయించారని.. 68 టికెట్లు సీజ్ చేశారు. ఇందులో అఖిల్అమద్ కీలక పాత్ర పోషించాడని రాచకొండ సీపీ చౌహాన్ తెలిపారు. నిందితులు ఎవరెవరికి టికెట్లు విక్రయించారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అక్రిడిటేషన్ కార్డు బార్కోడ్ను సెల్ఫోన్లో కాపీ చేసి.. అనంతరం జిరాక్స్ తీసి నకిలీలకు తెరలేపారని సీపీ చౌహాన్ వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com