
By - Subba Reddy |29 April 2023 5:15 PM IST
తెలంగాణలో వీధికుక్కలు హడలెత్తిస్తున్నాయి. రోడ్ల మీదకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. శంషాబాద్లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. మధురానగర్లో నలుగురిపై దాడికి తెగబడ్డాయి. ఈ ఘటనలో చిన్నారి సహా నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. కుక్కల దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. శంషాబాద్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఫైరవుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com