
By - Subba Reddy |30 April 2023 4:15 PM IST
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వం వ్యూహాత్మకంగా దివాళా తీయిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ ఆస్తులను కాజేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ చరిత్రను తిరగరాస్తామన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే వరకు ఉద్యోగులు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఐదు నెలల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com