
By - Chitralekha |1 May 2023 1:11 PM IST
కేరళలోనిత్రిసూర్లో పురం వేడుకలు వైభవంగాజరిగాయి. వడక్కునాథన్ ఆలయం వేదికగా ఈ ఉత్సవాలు జరిగాయి. పది గ్రామాల నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఏనుగులపై ఊరేగాయి. ప్రత్యేక పూజలు అనంతరం... ఆలయం సమీపంలోని థెక్కిన్కాడు మైదానంలో అంగరంగ వైభవంగా “పూరం” పర్వం జరిగింది. సంప్రదాయాలు, ఆచారాలకు పెద్దపీట వేసే కేరళలోని అన్ని ఆలయాలలో ఇలాంటి వేడుకలు జరుగుతాయి. కానీ, త్రిసూర్లోని జరిగే పూరానికి ఓ ప్రత్యేకత ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి... స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com