
By - Subba Reddy |3 May 2023 2:30 PM IST
ఏపీలో వామపక్షాలు ఆందోళన బాట పట్టాయి. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ మద్దిలపాలెం హై వేపై నిరసన చేపట్టారు. ఉక్కు పరిశ్రమపై సీఎం జగన్ స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేస్తు న్నారు. ప్రధాని మోదీకి జగన్ కొమ్ముకాస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఆందోళనకారుల నిరసనలతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com