
By - Subba Reddy |3 May 2023 3:45 PM IST
కాపులకు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమ. టీడీపీ హయాంలోనే కాపులకు న్యాయం జరిగిందన్నారు. తాను సీఎం అయ్యాక కాపులకు 10వేల కోట్లు ఇస్తానన్న జగన్.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. కాపు ద్రోహి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు కులాన్ని జగన్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టొద్దన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు దెబ్బలు తినడం ఖాయమన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com