బీజేపీ కౌంటర్ అటాక్

బీజేపీ కౌంటర్ అటాక్

భజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ హామీపై కౌంటర్ అటాక్ మొదలు పెట్టింది బీజేపీ. ప్రధాని మోదీ దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.. కర్ణాటకలో ప్రతి గ్రామంలోని ప్రతి ఆలయంలో హనుమాన్ చాలీసా చదవనున్నట్టు ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ బీజేపీ కార్యకర్తలు హనుమాన్ చాలీసా చదవబోతున్నారు. గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ చాలీసా చదివేందుకు ప్లాన్ చేస్తోంది బీజేపీ. భజ్‌రంగ్ దళ్ బ్యాన్‌ హామీ పూర్తి స్థాయిలో పొలిటికల్‌గా వాడుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే హనుమాన్ చాలీసా అంశం తెరపైకి తీసుకొచ్చింది.


Next Story