
By - Chitralekha |5 May 2023 12:33 PM IST
సిద్దిపేట జిల్లా పొట్లపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. జీవితం భారమై ఓ వృద్ధుడు తన చితిని తానే పేర్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడబోయిన వెంకటయ్య కు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. గత కొంత కాలం క్రితం భార్య చనిపోవడంతో తనకున్న నాలుగు ఎకరాల భూమిని కుమారులకు పంచి ఇచ్చేశాడు. ఈ క్రమంలో వెంకటయ్యను చూసుకునేందుకు కొడుకులు వంతులు వేసుకోవడంతో అతడి మనసు ముక్కలైంది. తాను ఎవరికీ భారం కాకూడదని, సొంత ఊరుని విడిచి వెళ్లేందుకు ఇష్టపడని వెంకటయ్య ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. వెంకటయ్య మరణంలో పొట్లపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com