రైతుల నష్టపరిహారాన్నీ మింగేస్తున్న జగన్ సర్కారు

రైతుల నష్టపరిహారాన్నీ మింగేస్తున్న జగన్ సర్కారు

అకాల వర్షాలతో ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. విపత్తులు సంభవించినప్పుడు నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన వెయ్యి కోట్లను కూడా ఏపీ ప్రభుత్వం మళ్లించేసింది. రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ వేరు.. విపత్తలు వచ్చినప్పుడు చేసే సాయం వేరు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడనే విపత్తుల సాయం కింద ప్రకటిస్తోంది. సర్కార్‌ నుంచి ఇప్పటి వరకూ పంట నష్టపరిహారంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమం చేపట్టకపోవడంపై సర్వత్రా మిమర్శలు తలెత్తుతున్నాయి.

Next Story