
By - Chitralekha |8 May 2023 4:03 PM IST
ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాలూరులో ఉన్న సెటిలర్లపై మండిపడ్డారు. సెటిలర్ల వల్ల సాలూరు నష్టపోతుందన్నారు. రెడ్లు, చౌదరిలు ఇక్కడఎక్కువగా ఉన్నారని వారి వల్ల సాలూరు ఆభివృద్ధి చెందడం లేదన్నారు. వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.సెటిలర్ల వ్యవహారం సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సాలూరును షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించాలని, గిరిజనులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. బబ్లూ అనే వ్యక్తి పేరును సంబోదిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజన్న దొర.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com