
By - Chitralekha |9 May 2023 1:14 PM IST
జనగామ ఎమ్మెల్యేముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై స్వయంగా ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి పోలీసు కేసు నమోదు చేశారు. తండ్రి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేర్యాల చౌరస్తాలో చేరువుని ఆనుకుని తనకు ఉన్న 1 ఎకరం 20 గుంటల భూమిని కాజేసేందుకు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని సెక్షన్ 406,420,463,464,468,471 కింద కేసు నమోదు చేశారు. గతంలో ఇదే భూమి కబ్జా విషయంలో యాదగిరి రెడ్డిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com